టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ముంబై హీరోయిన్లకి ఉన్నటువంటి క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే ఇప్పటికే చాలా మంది దర్శక నిర్మాతలు ముంబై హీరోయిన్ అయితే ఎలాంటి అభ్యంతరాలు లేకుండా తాము అనుకున్న విధంగానే సినిమాలని తీయవచ్చని అపోహలో ఉంటారని, దాంతో తమ చిత్రాల్లో నటించే వారి కోసం కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ మరియు షూటింగ్ లో పాల్గొనే సమయంలో ఖర్చుకు వెనకాడకుండా సౌకర్యాలను కల్పిస్తూ ఉంటారని కొందరు సీనియర్ నటీనటులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కాగా బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందినటువంటి ఒకప్పటి హీరోయిన్ అమీషా పటేల్ తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన “బద్రి” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైంది. అయితే ఈ అమ్మడు వచ్చి రావడంతోనే తన మొదటి చిత్రంతో ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకోవడంతో అతికొద్ది సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది.
ఈ క్రమంలో అమీషా పటేల్ తన స్టార్ ఇమేజ్ ని అడ్డుపెట్టుకొని అప్పట్లో తన పారితోషికాన్నిఒక్కసారిగా అమాంతం పెంచేసిందట. అంతేగాక తాను షూటింగ్ లో పాల్గొనే సమయంలో లగ్జరీ హోటళ్లలోనే బస చేసేదట.అప్పుడప్పుడు ముంబై నుంచి తనతో పాటు వచ్చిన వారి షాపింగ్ మరియు బస ఛార్జీలు కూడా నిర్మాతపై మోపడంతో సినిమా షూటింగ్ పూర్తయ్యే సరికి దాదాపుగా 20 శాతం అదనపు చార్జీలు సినీ నిర్మాతలు భరించాల్సి వచ్చేది.దీంతో కొందరు దర్శక నిర్మాతలు అమీషా పటేల్ కి సినిమా ఆఫర్లు ఇవ్వడం మానేశారు.
ఒకవేళ ఏదైనా చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం ఇచ్చినప్పటికీ పారితోషకం తప్ప ఎలాంటి ఇతర సౌకర్యాలను కల్పించమని నిర్మొహమాటంగా చెప్పేవారట.
ఏదేమైనప్పటికీ అమీషా పటేల్ తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రిన్స్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ తదితర స్టార్ హీరోల చిత్రాల్లో నటించినప్పటికీ హీరోయిన్ గా మాత్రం తెలుగు సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోలేకపోయింది.
కాగా ప్రస్తుతం అమీషా పటేల్ హిందీలో దేశీ మ్యాజిక్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.ఇటీవలే ఈ చిత్రానికి సంబందించిన చిత్రీకరణ పనులు పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.