చలో సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగు పెట్టిన కన్నడ భామ రష్మిక మందన్న ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది.ఆ తర్వాత వచ్చిన “గీత గోవిందం” సినిమాలోని గీత పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది ఈ అమ్మడు.
దీంతో ప్రస్తుతం ఈ రష్మిక మంచి అవకాశాలతో దూసుకుపోతుంది.అయితే ఈమె పెళ్లి గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని విషయాలు వైరల్ అవుతున్నాయి.
అయితే ఈమె చిత్రాల్లో నటించకు ముందు కన్నడ హీరో రక్షిత్ శెట్టి తో ప్రేమ వివాహం కుదిరిన విషయం అందరికి తెలిసిందే.అంతేగాక వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించి నిశ్చితార్థం కూడా చేయించారు.
అయితే ఈమె అప్పటికే చలో సినిమాలో నటించడం వల్ల చిత్రం పూర్తయిన తర్వాత పెళ్ళి నిశ్చయించారు.అయితే చలో సినిమా మంచి హిట్ అవడంతో ఈ అమ్మడికి భారీగానే ఆఫర్లు వచ్చాయి దాంతో రక్షిత్ తో పెళ్లి రద్దు చేసుకుని సినిమాలపై దృష్టి సారించింది.
ఈ విషయంపై అప్పట్లో నెటిజన్లు బాగానే ట్రోల్ చేశారు.అయితే మొన్నటికి మొన్న ఈ విషయంపై రక్షిత్ శెట్టి స్పందిస్తూ తనతో పెళ్లి రద్దు చేసుకోవడంలో రష్మిక తప్పేమీ లేదంటూ అంతేగాక ఆమెను ఎవరూ నిందించద్దు అంటూ తన అభిమానులకు సూచించిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా రష్మిక తన పెళ్లి గురించి స్పందించింది.అప్పట్లో రక్షిత్ శెట్టి తాను ప్రేమించుకున్నామని అందువల్లనే అతడిని పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడినట్లు చెబుతోంది.అయితే చలో చిత్రం తర్వాత కొత్త గ్యాప్ తీసుకుని సినిమాల్లో ఇంకా రాణించాలని పెళ్లిని రెండు సంవత్సరాలు వాయిదా వేసుకుందామని అనుకున్నారు.కానీ ఏళ్లు గడిచే కొద్దీ అవకాశాలు ఎక్కువ అవుతుండడంతో పెళ్లికి సమయం కేటాయించలేక పోయానని అంతేగాక నిర్మాతలను కూడా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకనే రక్షిత్ శెట్టితో వివాహం రద్దు చేసుకున్నట్లు రష్మిక మందన్న తెలిపారు. అయితే ప్రస్తుతం రష్మిక మందన్న టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు అనే చిత్రంలో నటిస్తోంది ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
.