బుల్లి తెర ప్రముఖ యాంకర్ శ్రీముఖి పటాస్ షో ద్వారా యాంకర్ గా బుల్లితెరపై అడుగుపెట్టారు.పటాస్ ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకున్న శ్రీముఖి పలు టీవీ కార్యక్రమాలలో, పాల్గొంటూ ఎంతో సందడి చేస్తున్నారు.
శ్రీముఖి యాంకరింగ్ ద్వారా ఎంతో పాపులర్ అయింది.అంతేకాకుండా బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ గా ఉన్న శ్రీముఖి టైటిల్ సొంతం చేసుకుంటారని ప్రేక్షకులు భావించారు.
అయితే చివరి వరకు ఎంతో అద్భుతంగా ఆడి కేవలం రన్నర్ గా మాత్రమే నిలిచిన సంగతి మనకు తెలిసిందే.
బిగ్ బాస్ తరువాత కొంతకాలం బుల్లితెరకు దూరంగా ఉంటున్న శ్రీముఖి ప్రస్తుతం బొమ్మ అదిరింది అనే షో కి యాంకర్ గా విధులు నిర్వహిస్తున్నారు.
బొమ్మ అదిరింది షో బాగా హిట్ అవడంతో శ్రీముఖి మరింత పాపులర్ అయ్యారు.ఈ విధంగా టీవీ షోలు చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్న శ్రీముఖి తాజాగా తన ఇంటికి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు.
ఈ ఫోటోలను షేర్ చేస్తూ ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కట్టుకోవాలనే ఉంటుంది.శ్రీముఖి కి కూడా అలాంటి కోరిక ఉంది.ప్రస్తుతం ఆ కోరికను నెరవేర్చుకుంటున్నట్లు ఆమె తెలిపారు.”కుటుంబంతో కొత్త ఆరంభం అంటూ” శ్రీముఖి ఫోటోలను షేర్ చేసింది.శ్రీముఖి కొత్త ఇంటిని తన సొంత ఊరు నిజామాబాద్ లో తన అభిరుచులకు తగ్గట్టుగా కట్టిస్తోందని సమాచారం.అయితే తాజాగా ఈ ఇంటికి గుమ్మాన్ని ప్రతిష్టించిన సందర్భంగా తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీముఖి ఫోటోలను తన అభిమానులతో పంచుకున్నారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు శ్రీముఖి కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.