సినిమాల ఎంపికలో కథనాయికలు.తమ పంథా మార్చుకున్నారు.
కథకి, కథనానికి, నటనకు స్కోప్ ఉన్న పాత్రలనే ఎంచుకుంటున్నారు.అందులో తాప్సీ కూడా ఒకరు పింక్ సినిమాతో తన అభినయానికి ఫుల్ మార్క్స్ వేసుకున్న తాప్సి.
ఇప్పుడు మరో బలమైన పాత్రలో నటించనుంది.భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్లో టైటిల్ పాత్ర పోషించనున్నారు.
ఈ విషయాన్ని తాప్సీ నిర్ధారించారు.మిథాలీ బర్త్డే సందర్భంగా తాప్సీ ఈ విషయం వెల్లడించారు.
శభాష్ మితు పేరిట తెరకెక్కనున్న ఈ బయోపిక్లో దిగ్గజ మహిళా క్రికెటర్ పాత్రలో తాప్సీ కనిపించనున్నారు.ఈ పాత్ర తనకు రావడం చాలా గర్వంగా ఉందని తాప్సీ పేర్కొన్నారు.