విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా నటిస్తున్న చిత్రం థాంక్యూ.ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుపుకుంది.
నెల రోజుల షెడ్యూల్ కోసం గత నెలలో కరోనా సెకండ్ వేవ్ కి ముందు విక్రమ్ టీమ్ మొత్తం ఇటలీ వెళ్ళిపోయారు.అక్కడ ఏకదాటిగా షూటింగ్ కొనసాగించి తాజాగా ఇటలీ షెడ్యూల్ కి ప్యాకప్ చెప్పేశారు.
ఈ విషయాన్ని రాశీఖన్నా ట్విట్టర్ ద్వారా ఒక్క సెల్ఫీతో రివీల్ చేసింది.ఇటలీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథ స్టార్ట్ అయ్యి ఇండియాకి వస్తుంది.
ఇటలీకి చెందిన ఓ ఎన్నారై బిజినెస్ మెన్ గా చైతన్య కనిపిస్తాడని తెలుస్తుంది.
ఈ నేపధ్యంలో అక్కడ పెరిగిన చైతన్యగా తన మూలాలు ఇండియాలో ఉన్నాయని తెలుసుకొని తనవాళ్ళని వెతకడానికి ఇండియా వస్తాడని ఆ క్రమంలో ఎదురయ్యే సవాళ్ళతో ఈ సినిమా కాన్సెప్ట్ ఉంటుందనే టాక్ వినిపిస్తుంది.
ఇక సినిమా రాశీఖన్నాతో పాటు మాళవిక నాయర్ హీరోయిన్స్ గా నటిస్తూ ఉండగా యంగ్ బ్యూటీ అవికా గోర్ చైతన్యకి చెల్లెలుగా సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది.ఇక ఇటలీ షెడ్యూల్ పూర్తి కావడంతో ఇండియాకి తిరిగి వస్తున్నట్లు రాశీఖన్నా తన ట్విట్టర్ లో రివీల్ చేసింది.
ఇదిలా ఉంటే చైతన్య హైదరబాద్ రాకుండా నేరుగా కాశ్మీర్ లో లధక్ కి అమీర్ ఖాన్ సినిమా లాల్ సింగ్ చద్దా షూటింగ్ కోసం జాయిన్ అవ్వనున్నట్లు తెలుస్తుంది.అది పూర్తి చేసుకొని హైదరాబాద్ వస్తాడని సమాచారం.
మొత్తానికి కరోనా సెకండ్ వేవ్ టైంలో కూడా గ్యాప్ లేకుండా వరుస షూటింగ్ లు పెట్టుకున్న హీరోల జాబితాలో చైతన్య ముందు వరుసలో ఉన్నాడని తెలుస్తుంది.
.