మాజీ మంత్రి తమ్మినేని సీతారం తల్లి ఇందుమతి 86ఏళ్ళు వృద్దాప్యంలో అనారోగ్య సమస్యలతో మరణించారు.ఆమె తమ్మినేని స్వగ్రామం అయిన తొగారాంలో మంగళవారం అర్ధరాత్రి ఆమె తుది శ్వాసవ విడిచారు.
ఆమెకు ముగ్గురు కుమార్లు ఇద్దరు కూతుళ్లు కాగా ఇద్దరు కొడుకులు ఈమధ్య కాలంలో మృతి చెందారు.మొదట్నుంచి తమ్మినేని కుటుంబం రాజకీయాల్లో మునిగి తేలిపోతుండేది.
తమ్మినేని సీతారం పెదనాన్న పాపారావు నాలుగు సార్లు ఎమ్ ఎల్ ఏ అయ్యారు.ఆయన తమ్ముడు శ్రీరామమూర్తి మూడో కొడుకైన సీతారం ఐదు సార్లు ఎమ్ ఎల్ ఏ అయ్యారు.
పలు శాఖల మంత్రిగా పదేళ్ళపాటు టిడిపిలో ఎన్ టి ఆర్, బాబు సర్కార్లలో పని చేసారు.ఇందుమతి కూతురు కొడుకే ప్రభుత్వ విప్ కూన రవికుమార్.