మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే.ఇక ఈ మూవీని త్రివిక్రమ్ గత చిత్రాల మాదిరి కాకుండా సరికొత్త కథనంతో ప్రెజెంట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.
తనకి అలవాటైన ఫ్యామిలి ఎలిమెంట్స్ మిక్స్ చేస్తూనే కథని స్పై థ్రిల్లర్ గా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది.ఇక మూవీలో మహేష్ రా ఏజెంట్ గా కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది.
అలాగే హీరోయిన్స్ పాత్ర కోసం బాలీవుడ్ భామల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.జాన్వీ కపూర్ ని ఈ మూవీతో టాలీవుడ్ కి పరిచయం చేయాలని అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది.
మరో వైపు పూజా హెగ్డే పేరు కూడా ఈ మూవీ కోసం వినిపిస్తుంది.ఆమె కూడా గతంలో తన నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఉంటుందనే చూచాయగా చెప్పింది.
పూజా హెగ్డే మహర్షి మూవీలో ఇప్పటికే మహేష్ కి జోడీగా నటించింది.ఇప్పుడు త్రివిక్రమ్ మూవీ కోసం మరోసారి సూపర్ స్టార్ తో జతకట్టే అవకాశం వచ్చినట్లే కనిపిస్తుంది.
ఇదిలా ఉంటే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా తెరపైకి తమన్ పేరు వచ్చింది.అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ చేసిన రెండు సినిమాలు అరవింద సమేత, అల వైకుంఠపురంలో మూవీస్ కి తమన్ స్వరాలు అందించారు.
ఈ రెండు సినిమాల సాంగ్స్ మంచి హిట్ అయ్యాయి.అల వైకుంఠపురంలో సాంగ్స్ అయితే ఇండియన్ వైడ్ గా ట్రెండ్ అయ్యాయి.
ఈ నేపధ్యంలో మహేష్ సినిమా కోసం సంగీత సారధ్య బాధ్యతలు అతనికే అప్పగించాలని త్రివిక్రమ్ చూస్తున్నట్లు తెలుస్తుంది.మరో వైపు ఈ మధ్య ఫామ్ లోకి వచ్చిన మణిశర్మ పేరు కూడా గట్టిగానే వినిపిస్తుంది.
ఇక మహేష్ బాబు అయితే దేవిశ్రీ ప్రసాద్ ని రిఫర్ చేస్తున్నట్లు తెలుస్తుంది.