టాలీవుడ్లో సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ జాబితాలో అతి తక్కువ సమయంలో చేరిపోయాడి సంగీత దర్శకుడు థమన్.అతడు అందించే సంగీతం యూత్ను టార్గెట్ చేసుకుని ఉండటంతో వారు థమన్ మ్యూజిక్కు తొందరగా కనెక్ట్ అవుతున్నారు.
ఇక థమన్ తన కెరీర్లో ఎన్నో బెస్ట్ సాంగ్స్ ఇవ్వగా, రీసెంట్గా అల వైకుంఠపురములో చిత్రంతో కెరీర్ బెస్ట్ మ్యూజిక్ అందించాడనే పేరు తెచ్చుకున్నాడు.కాగా ప్రస్తుతం చేతినిండా సినిమాలు ఉన్న అతితక్కువ మంది మ్యూజిక్ డైరెక్టర్స్లో థమన్ ఒకడు.
అయితే ప్రస్తుతం టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న రాధేశ్యామ్ కూడా ఒకటి.ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా ఈ సినిమాను జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.అయితే ఈ సినిమాకు సంగీతం ఎవరు అందిస్తున్నారనే అంశంపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.
ఇప్పటికే కొందరి పేర్తు వినిపించినా, అది కేవలం పుకారు అని మాత్రమే తెలుస్తోంది.
కాగా రాధేశ్యామ్ సినిమాకు థమన్ సంగీతం అందించనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాను టాలీవుడ్ ప్రేక్షకులు మెచ్చే విధంగా ఉండాలంటే తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ అయితేనే కరెక్ట్ అని చిత్ర యూనిట్ భావిస్తోందట.దీంతో ఈ సినిమా కోసం థమన్ను సంప్రదించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయినట్లు తెలుస్తోంది.
ఈ వార్త గనక నిజం అయితే థమన్ తొలిసారి భారీ బడ్జెట్ చిత్రానికి సంగీతం అందించినట్లు అవుతుంది.మరి నిజంగానే రాధేశ్యామ్కు థమన్ సంగీతం అందిస్తున్నాడా లేడా అనేది చూడాలి.