టాలీవుడ్ లో చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు.కానీ అందరిలో కొంత మంది మాత్రమే టాప్ ప్లేస్ లో ఉన్నారు.
మరి అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ లలో టాప్ లో ఉంది ఇద్దరు అనే చెప్పాలి.వారే ఎస్ ఎస్ థమన్, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్.
వీరిద్దరూ ప్రెజెంట్ టాలీవుడ్ లో టాప్ ప్లేస్ లో ఉన్నారు.ఇది వరకు దేవిశ్రీ వరుస సూపర్ హిట్స్ తో టాప్ లో ఉండేవాడు.
కానీ ఈ మధ్య కాలంలో థమన్ వరుస హిట్స్ అందుకుని ముందు వరుస లోకి వచ్చేసాడు.అయితే సంక్రాంతికి వీరిద్దరి మధ్య బిగ్ ఫైట్ జరగనుంది.2023 సంక్రాంతి బరిలో ”వీరసింహ రెడ్డి” సినిమాతో బాలయ్య, వాల్తేరు వీరయ్య సినిమాతో చిరంజీవి బరిలో దిగబోతున్నారు.ఈ రెండు చాలా రోజుల తర్వాత బాలయ్య, చిరంజీవి ఒకేసారి సినిమాలతో రాబోతున్నారు.
మరి ఈ హీరోల మధ్యే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ల మధ్య కూడా ఈసారి బిగ్ ఫైట్ జరగబోతుంది.ఇందులో చిరు వాల్తేరు వీరయ్య సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
అయితే తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసారు.కానీ దేవిశ్రీ ప్రసాద్ మాత్రం ఫస్ట్ సింగిల్ తో నిరాశ పరిచాడు అనే చెప్పాలి.
బాస్ పార్టీ సాంగ్ ప్రోమో రిలీజ్ చేయగా దీనికి నెగిటివ్ టాక్ వచ్చింది.దేవిశ్రీ ఏమాత్రం అంచనాలు అందుకోలేక పోతున్నాడు
అయితే ఇక ఇప్పుడు థమన్ వీరసింహ రెడ్డి ఫస్ట్ సింగిల్ త్వరలోనే రాబోతుంది అని ప్రకటించాడు.దీంతో దేవిశ్రీ నిరాశ పరిచాడు.ఇక థమన్ అయిన ఫ్యాన్స్ ఆశలను నెరవేరుస్తాడా లేదా అని ఎదురు చూస్తున్నారు.
దీంతో ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.ఫస్ట్ సింగిల్ తోనే ఇలా అవ్వడంతో ఈ ఇద్దరిలో ఈసారి ఎవరు విన్ అవుతారో అనేది మరింత ఆసక్తిగా మారింది.