ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ కు మంచి గుర్తింపు ఉంది.ప్రస్తుతం థమన్ ఒక్కో సినిమాకు మూడు కోట్ల రూపాయల నుంచి నాలుగు కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
థమన్ తండ్రి శివకుమార్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ అనే సంగతి తెలిసిందే.అయితే థమన్ కూడా చిన్నప్పుడు ఎన్నో కష్టాలను అనుభవించారు.
థమన్ పదేళ్ల వయస్సులో ఉన్న సమయంలోనే ఆయన తండ్రి చనిపోయారు.
తాజాగా ఒక షోకు హాజరైన థమన్ మాట్లాడుతూ ఫాదర్ చనిపోయిన సమయంలో తనకు ఏడుపు రాలేదని అన్నారు.
ఫాదర్ చనిపోయిన సమయంలో 60,000 రూపాయలు ఎల్.ఐ.సీ డబ్బులు వచ్చాయని ఆ డబ్బుతో అమ్మ డ్రమ్స్ కొనిచ్చిందని థమన్ చెప్పుకొచ్చారు.ఆ డ్రమ్స్ తో తాను ఆదాయాన్ని ఆర్జించడం మొదలుపెట్టానని థమన్ కామెంట్లు చేశారు.
భైరవద్వీపం సినిమాకు 30 రూపాయలు తాను తీసుకున్నానని థమన్ చెప్పుకొచ్చారు.
ఫాదర్ తో దిగిన ఫోటోను చూసి ఢిల్లీలో ఆ ఫోటోను తీసుకున్నామని ట్రైన్ లో ప్రయాణించే సమయంలో నాన్నకు మాస్సివ్ హార్ట్ ఎటాక్ వచ్చిందని థమన్ పేర్కొన్నారు.
రైల్వే స్టేషన్ లో దిగిన వెంటనే అక్కడ జనరల్ హాస్పిటల్ ఉందని అక్కడికి తీసుకెళ్లి ఉంటే నాన్న బ్రతికేవారని థమన్ వెల్లడించారు.థమన్ కష్టాల గురించి తెలిసి నెటిజన్లు షాకవుతున్నారు.మరోవైపు ప్రభాస్ మినహా అందరు టాలీవుడ్ హీరోలతో కలిసి థమన్ పని చేశారు.
త్వరలో ప్రభాస్ తో కలిసి పని చేసే అవకాశం కూడా తనకు దక్కుతుందని థమన్ భావిస్తున్నారు.వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ థమన్ కు ఛాన్స్ ఎప్పుడు ఇస్తారో చూడాల్సి ఉంది.థమన్ మ్యూజిక్ అందించిన సర్కారు వారి పాట, భీమ్లా నాయక్ సినిమాలు వచ్చే ఏడాది కొన్నిరోజుల గ్యాప్ లో థియేటర్లలో విడుదల కానున్నాయి.