ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా.ఈ పాటికే గుర్తు పట్టాల్సిందే.
అవును ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి టాలీవుడ్ నటుడు మహేష్ బాబు.తాజాగా ఈయన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ఓ సంగీత దర్శకుడు షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ గా మారింది.
ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సర్కారు వారి పాట సినిమాల్లో చాలా బిజీగా ఉన్నాడు.
ప్రస్తుత మహేష్ బాబు వరుస ఆఫర్లతో అవకాశాలను సొంతం చేసుకుంటున్నారు.
ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబు హీరోగా నటించగా, హీరోయిన్ కీర్తిసురేష్ నటిస్తుంది.ఇక ఈ సినిమా గత ఏడాది లాక్ డౌన్ కారణంగా వల్ల ఆలస్యంగా అవ్వడంతో ప్రస్తుతం ఈ షూటింగ్ జోరుగా జరుగుతుంది.
ఇక ఈ సినిమా బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న మోసాల గురించి బయట ప్రపంచంకు తెలియజేసేలా దర్శకుడు తెరకెక్కించనున్నాడు.ఈ సినిమాలో పాటలను తమన్ అందిస్తున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల నుండి దుబాయ్ లో జరుగుతుండగా.తాజాగా అక్కడ సినిమా షూటింగ్ లొకేషన్ లో మహేష్ బాబు ఫోటోను సంగీత దర్శకుడు తమన్ తన సోషల్ మీడియా ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు.
ఇందులో మహేష్ బాబు ముఖానికి మాస్క్ కట్టుకొని ఉండగా వెనకాల నుండి తీసిన ఈ ఫోటో స్టైల్ గా ఆకట్టుకుంది.ఇక ఈ సినిమా గురించి తమన్ మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తయిందని తెలిపాడు.
అంతేకాకుండా కరోనా నేపథ్యంలో చాలా జాగ్రత్తలతో షూటింగ్ లో పాల్గొన్నారని తెలిపాడు.
ఇదిలా ఉంటే దుబాయిలో షూటింగ్ పూర్తి కాగా ఇటీవలే ఈ సినిమా బృందం హైదరాబాద్ కు చేరుకుంది.
ఇక మరో పాటకోసం ఈ సినీ బృందం త్వరలోనే గోవాకు వెళ్లనున్నారు.