మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.ఈ సినిమాతో రామ్ చరణ్ వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యాడు.
ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ మరో అగ్ర డైరెక్టర్ దర్శకత్వంలో నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు.మావెరిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శంకర్ తో చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రకటించాడు.
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ‘RC15‘.ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా ప్రకటించగానే భారీ అంచనాలు పెరిగాయి.శంకర్ సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో రిలీజ్ తర్వాత ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తాయో అందరికి తెలుసు.
మరి అలాంటి శంకర్ ఆయన సినిమాలో ప్రతీది పర్ఫెక్ట్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాడు.
చిన్న సీన్స్ దగ్గర నుండి డ్యాన్స్, పాటలు, సెట్స్ ఇలా ప్రతీ విషయంలో కోట్లు ఖర్చు పెట్టి అయినా పర్ఫెక్ట్ గా తీర్చిదిద్దుతాడు.ఇక ఇప్పుడు చేస్తున్న రామ్ చరణ్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా శంకర్ థమన్ ను తీసుకున్నారు.టాలీవుడ్ లో ప్రజెంట్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ కొనసాగుతున్నాడు.
అందుకే ఈ భారీ ప్రాజెక్టుకు కూడా థమన్ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు.
ఈ సినిమా అప్డేట్ రావడం లేదని మెగా ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.ఈ క్రమంలోనే ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు.”తాను ఇప్పుడు సినిమాల్లా ఈ సినిమా కాదని శంకర్ గారి సినిమా అంటే అదే వేరే లెవల్” అంటూ చెప్పుకొచ్చాడు.ఇంకా ఈ ఆల్బమ్ గురించి ఇప్పుడేమీ మాట్లాడానికి అని సౌండింగ్ అంతా డిఫెరెంట్ గా ఉంటుంది అని తెలిపాడు.దీంతో ఈ సినిమా ఆల్బమ్ వేరే లెవల్ లో ఉండబోతుంది అని థమన్ చెప్పకనే చెప్పాడు.