మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సోలో బ్రతుకే సో బెటర్ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది.కానీ లాక్డౌన్ కారణంగా ఈ సినిమా వాయిదా పడింది.
ఇక ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న ఈ సినిమా, తాజాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.తేజు ఈ సినిమాతో మరోసారి సక్సెస్ అందుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు.
ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.
పూర్తి యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు థమన్ తనదైన మార్క్ సంగీతం అందిస్తున్నట్లు మొదట్నుండీ చెబుతూ వస్తున్నాడు.
కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా ఈ సినిమాకు తుది మెరుగులు ఇస్తున్నాడు ఈ మ్యూజిక్ డైరెక్టర్.అదిరిపోయే ఎనర్జిటిక్ సౌండ్ట్రాక్ను ఈ సినిమాకు ఇస్తున్నట్లు థమన్ పేర్కొన్నాడు.
ఇప్పటికే ఈ సినిమాలోని ‘నో పెళ్లి’ పాట అదిరిపోయే రెస్పాన్స్ను దక్కించుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను సుబ్బు అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తున్నాడు.
సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్గా నటిస్తోంది.కాగా ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.థియేటర్లు తెరుచుకున్న వెంటనే ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.మరి సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం ఎలాంటి సక్సెస్ను అందుకుంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.