టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో థమన్ ఒకరుగా సత్తా చాటుతున్నాడు.ఆయన చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్నాయి.
థమన్ మ్యూజిక్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.అటు మాస్ ఆడియెన్స్ ను ఇటు క్లాస్ ఆడియెన్స్ ను మెప్పిస్తూ థమన్ సంగీతం అందిస్తున్నారు.
అల వైకుంఠ పురములో సినిమాకు థమన్ అందించిన సంగీతం ఒక రేంజ్ లో ఆకట్టుకుంది.ఇప్పటికి ప్రేక్షకులు ఆ సాంగ్స్ వింటున్నారంటేనే తెలుస్తుంది ఈ మ్యూజిక్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అనే విషయం.
థమన్ కెరీర్ మొదట్లో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాడు.కానీ ఇప్పుడు థమన్ రోజురోజుకూ కొత్తగా క్రియేటివిటీగా మ్యూజిక్ అందిస్తూ మ్యూజిక్ లవర్స్ తో పాటు సగటు అభిమానులను కూడా ఆకట్టుకుంటున్నాడు.
ఈ సంవత్సరం కూడా క్రాక్, వకీల్ సాబ్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇప్పుడు మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాకు, అలాగే బాలయ్య నటించే అఖండ సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నాడు.సర్కారు సినిమాపై థమన్ తాజాగా కొన్ని కామెంట్స్ చేసారు.ఈ సినిమా మాస్ అంశాలతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ అని థమన్ చెప్పారు.
ఇంకా ఈ సినిమాలో అటు క్లాస్ ఆడియెన్స్ తోపాటు ఇటు మాస్ ఆడియెన్స్ ను చూసుకుంటూనే కామెడీ కూడా మిస్ కాకుండా తెరకెక్కిస్తున్నట్టు ఆయన తెలిపాడు.ఈ సినిమాను పరుశురాంమ్ దర్శకత్వంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కిస్తున్నారు.
తాజాగా థమన్ త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాకు కూడా సంగీతం అందించ బోతున్నట్టు కన్ఫర్మ్ చేసాడు.మొత్తానికి థమన్ టాలీవుడ్ ఇండస్ట్రీ ని దున్నేస్తున్నాడు.