కోలీవుడ్ స్టార్ హీరోల్లో విజయ్ దళపతి నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ”వారసుడు”.వరుస హిట్స్ తో వందల కోట్లు వసూళ్లు చేస్తూ కోలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ డమ్ అందుకున్న విజయ్ సినిమాలంటే కోలీవుడ్ ప్రజలు ఈగర్ గా ఎదురుచూస్తూ ఉంటారు.
బీస్ట్ సినిమాతో ఆయన ఫ్యాన్స్ ను మెప్పించలేక పోయాడు.అందుకే మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
తమిళ్ లో ‘వరిసు’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ క్రేజీ సినిమాపై ఇప్పటికే తమిళ్ లో అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
దిల్ రాజు భారీ స్థాయిలో శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా మరో అప్డేట్ బయటకు వచ్చింది.
ఇప్పటి వరకు ఈ సినిమా 2023 సంక్రాంతి రేస్ లో ఉండబోతుంది అని కన్ఫర్మ్ చేసారు.
కానీ ఇంత వరకు రిలీజ్ డేట్ అయితే ప్రకటించలేదు.అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు.
ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు యూకే డిస్టిబ్యూషన్ సంస్థ శ్లోక ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా కన్ఫర్మ్ చేసేసారు.దీంతో ఇప్పటి వరకు ఉన్న సస్పెన్స్ తొలగి పోయింది.
మరి దిల్ రాజు భారీ పోటీ నడుమ తమిళ్ సినిమాను రిలీజ్ చేస్తున్నాడు.దీంతో ఇది ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఖుష్బూ, మీనా, శ్రీకాంత్, జయసుధ, యోగిబాబు, శరత్ కుమార్ వంటి వారు నటిస్తున్నారు.చూడాలి మరి ఈ సినిమాతో దిల్ రాజు హిట్ అందుకుంటాడో.
ప్లాప్ అందుకుంటాడో.