బాద్షా ఆఫ్ బాలీవుడ్, కింగ్ ఖాన్ అని ప్రేక్షకులు ముద్దుగా పిలుచుకునే షారుఖ్ ఖాన్… ఆసియాలోనే గొప్ప పేరున్న నటుడిగా పేరు సాధించారు.అంతేకాకుండా ప్రపంచంలోని అత్యంత సక్సెస్ ఫుల్ ఫిలిం స్టార్ లలో ఒకరిగా నిలిచిన వ్యక్తి మన షారుఖ్ అని గొప్పగా చెప్పుకోవచ్చు.
టీవీ సీరియల్స్ ద్వారా కెరీర్ ప్రారంభించిన ఈయన దీవానా సినిమాతో బాలీవుడ్ తెరంగేట్రం చేశారు.మొదట్లో ప్రతినాయిక పాత్రలు పోషించినప్పటికీ తదనంతరం రొమాంటిక్, కామెడీ సినిమాల్లో నటించితన టాలెంట్ ను నిరూపించుకున్నారు.
దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే, కభీ ఖుషీ కభీ గమ్, కుచ్ కుచ్ హోతా హై.వంటి చిత్రాల్లో అద్భుతమైన నటన కనబరిచారు.అత్యున్నమైన పద్మశ్రీ అవార్డును అందుకొని.భారతీయ సినిమాల్లో ఒక ముద్ర వేసుకున్నారు షారుఖ్.
ఎన్నో వ్యవస్థాపక వెంచర్లు చేస్తున్నందున మీడియా ఆయనను బ్రాండ్ ఎస్.ఆర్.కె గానూ పేరు గడించారు.
నిత్యం షూటింగులు, టీవీ షోలంటూ బిజీగా గడిపే షారుఖ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జవాన్ అందరికీ తెలిసిందే.ఈ చిత్రంలో హీరోయిన్లు నయనతార, ప్రియమణి, సాన్యా మల్హోత్రా నటిస్తున్నారు.ఈ మధ్యే ఈ చిత్ర షూటింగ్ పుణెలో మొదలైనట్టు తెలుస్తోంది.ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ మూవీలో మన తమిళ్ హీరో విజయ్ అతిథి పాత్ర చేయనున్నారని సమాచారం.2012లో వచ్చిన హిందీ రీమేక్ ‘రౌడీ రాథోడ్’ లో గెస్ట్గా కనిపించారు.ఒకవేళ ఈ జవాన్‘ సినిమా గనక ఒకే ఐతే తొమ్మిదేళ్ల తర్వాత హిందీలో విజయ్ కనిపించే సినిమా ఇదే అవుతుంది.