ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పరిచయం గురించి అందరికీ తెలిసిందే.తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, హిందీ సినిమాలకు కూడా డాన్స్ ను అందించాడు.
ఇక ఈయన తొలిసారిగా ఈటీవీలో ప్రసారమైన ఢీ డాన్స్ షో ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.దాంతో 2009లో ద్రోణ సినిమా కు తనకు కొరియోగ్రాఫర్ గా అవకాశం వచ్చింది.
ఇక ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక బాలీవుడ్ లో కూడా తన డాన్స్ ను పరిచయం చేసి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు.
ఇక బుల్లితెర లో కూడా పలు షోలలో జడ్జిగా చేశాడు.అల వైకుంఠపురములో బుట్ట బొమ్మ పాటకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇదిలా ఉంటే ప్రస్తుతం కోలీవుడ్ లో కూడా ప్రస్తుతం ఓ సినిమాకు తన కొరియోగ్రాఫర్ గా చేస్తున్నాడు జానీ మాస్టర్.ఇదిలా ఉంటే నిన్న జానీ మాస్టర్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో ఆయన అభిమానులు బర్త్డే విషెస్ ను తెలిపారు.
ఇదిలా ఉంటే దళపతి విజయ్ కూడా తనపై చూపించిన ప్రేమ కు ఫిదా అయ్యాడు జానీ మాస్టర్.
ప్రస్తుతం దళపతి విజయ్ నెల్సన్ దర్శకత్వంలో బీస్ట్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది.ఈ సినిమాలో టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమాకు జానీ మాస్టర్ తన కొరియోగ్రఫీ అందిస్తున్నాడు.ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సమయంలో ఉండగా అక్కడే జానీ మాస్టర్ ఉండటంతో సినీ బృందం జానీ మాస్టర్ బర్త్ డే ను అక్కడే సెలబ్రేట్ చేసింది.
ఇక ఈ వేడుకల్లో దళపతి విజయ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.ఈ వేడుక గ్రాండ్ గా సెలబ్రేట్ చేయగా జానీ మాస్టర్ ఆనందానికి అంతులేకుండా పోయింది.అంతేకాకుండా దళపతి బర్త్ డే విషెస్ చెప్పి జానీ మాస్టర్ ను గట్టిగా హత్తుకోగా ఎంతో సంతోషపడ్డాడు జానీ మాస్టర్.ఈ జీవితానికి ఇది చాలు అన్నట్లుగా తన పుట్టినరోజు వేడుక ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకోగా ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.