కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సెల్వరాఘవన్ తెలుగులో వెంకటేష్, త్రిష జంటగా ఎక్కిన “ఆడవారి మాటలకు అర్థాలేవేరులే” అనే చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి మనకు తెలిసిందే.దర్శకుడిగా ఎంతో పేరు సంపాదించుకున్న సెల్వరాఘవన్ ‘సాని కాయిదమ్’ చిత్రం ద్వారా నటుడిగా మారారు.
ఈ క్రమంలోనే స్టార్ హీరో విజయ్ హీరోగా నెల్సన్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ‘బీస్ట్’ .ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు.అదే విధంగా ఈ సినిమాలో కీర్తి సురేష్ ఓ కీలకమైన పాత్రలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.
తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ విషయాన్ని చిత్ర బృందం విడుదల చేశారు.ఈ సినిమాలో పలువురు నటీనటులు కీలక పాత్రలో పోషిస్తున్నారని వారి పేర్లను తెలిపారు.
సెల్వరాఘవన్తో పాటు యోగిబాబు, వీటీవీ గణేష్, లిల్లీపుట్ ఫరూకీ వంటి నటీనటులు కీలక పాత్రలో సందడి చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.
ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఉన్నటువంటి సెల్వ రాఘవన్ ఈ చిత్రంలో విజయ్ తో పోటీ పడుతూ విలక్షణ పాత్రలో నటించడానికి సిద్ధమైనట్లు సమాచారం.అయితే ఈ విషయం గురించి చిత్రబృందం ఎలాంటి అధికారిక ప్రకటన వెలువరించే లేదు.