కేసీఆర్ మెదడు దెబ్బతింది.. భయపడాల్సిన పనిలేదన్న టీజీ వెంకటేష్..!

ఏపీ, తెలంగాణా నీటి వివాదంపై బీజేపీ ఏపీ నేత రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణా సీఎం కే.

 Tg Venkatesh Targets Kcr Water Fight Ap , Bjp Leader , Tg Venkatesh , Cm Kcr , F-TeluguStop.com

సి.ఆర్ కు కరోనా కారణంగా మొదడు దెబ్బతిన్నదని అందుకే నీటి పంపకాలకు సంబంధించి చేసుకున్న ఒప్పందాలను ఆయన మర్చిపోయారని అన్నారు టీజీ వెంకటేష్.శ్రీశైలం ప్రాజెక్ట్ విద్యుత్ ప్రాజెక్ట్ మాత్రమే అని తెలంగాణ నేతలు అంటున్నారు అది విద్యుత్ ప్రాజెక్ట్ అయినప్పుడు దాని నీటిని సాగునీరుగా తాగునీరుగా ఎందుకు వాడుతున్నారని ప్రశ్నించారు టీజీ వెంకటేష్.జల వివాఅలు సివిల్ వార్ కు దారి తీస్తాయని ఆయన చెప్పారు.

రాయలసీమ, ఆంధ్రా నాయకులు ఎవరు కే.సి.ఆర్ కు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.ఏపీ ఓట్లు తెలంగాణాలో ఉన్నాయి తప్ప తెలంగాణా ఓట్లు ఏపీలో లేవని టీజీ వెంకటేష్ అన్నారు.

కే.సి.ఆర్ ద్వంద్వ వైఖరి అవలంభిస్తారని హైదరాబాద్ ఎన్నికలప్పుడు ఆంధ్రా పాట కరీం నగర్ ఎన్నికలప్పుడు తెలంగాణా పాట పాడతారని అన్నారు.ఏపీ పోలీసులు యాక్షన్ తీసుకుని శ్రీశైలం డ్యాం ను స్వాధీనం చేసుకోవాలని అన్నారు టీజీ వెంకటేష్.

ఇప్పటికే ఇరు రాష్ట్రాల మధ్య నీటి గొడవ తారాస్థాయికి చేరుతుంది.అయితే మాట్లాడాల్సిన ముఖ్యమంత్రులు మాత్రం ఈ విషయంపై సైలెంట్ గా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube