చైనా లో పుట్టిన కరోనా వైరస్ ఆ దేశాన్ని అతలాకుతలం చేసిన సంగతి అందరికి తెలిసిందే.ఈ వైరస్ ని జనవరి లోనే చైనా కనుగొన్నా ప్రపంచానికి చాలా కాలం ఈ విషయాన్ని దాచిపెట్టి ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని ఆందోళనలోకి నెట్టింది.
ఈ వైరస్ కారణంగా వేలాది మంది చైనాలో మరణించగా ఎంతో మంది పాజిటివ్ కేసులు ఉన్న వాళ్లు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.అయితే చైనాలో కరోనా రోగులకి చికిత్స అందించేందుకు వెంటిలేటర్ సదుపాయాలూ చాలడం లేదని వార్తలు వస్తున్నా నేపధ్యంలో అమెరికా అపర కుభేరుడు టెక్ మొఘల్ గా పేరొందిన ఎలన్ మస్క్ తన దాతృత్వాన్ని చాటుకున్నాడు.
చైనా కరోనా బాధితులకి వెంటిలేటర్లు అందించేందుకు మాస్క్ ముందుకు వచ్చాడు.వారికి నా వంతు సాయం చేస్తాను బాధిత రోగులకి సాయంకోసం తనవంతుగా.
1255 ఎఫ్డీఏ నిర్ధారిత రెస్ మెడ్ , ఫిలిప్స్, మెడ్ ట్రానిక్, వెంటిలేటర్లు విమానంలో పంపుతున్నట్టుగా మాస్క్ ట్వీట్ చేశారు.అంతేకాదు మీకు ఎలాంటి అవసరం ఉన్నా మరిన్ని వెంటిలేటర్లు కావాలని అనుకున్నా తనకి నాకు తెలియచేయండి అంటూ ట్వీట్ చేశారు.ఈ మధ్య కాలంలోనే మాస్క్ అమెరికాలోని పలు ఆసుపత్రులకి యూనివర్సిటీ లకి సుమారు 2,50,000 వేల ఎన్ -96 మస్క్ లని ఉచితంగా అందించారు.