ఇటీవలే ఉగ్రవాదులు ఓ పాఠశాలలో ప్రిన్సిపాల్ అదేవిధంగా ఉపాధ్యాయుని కాల్చి చంపడం తెలిసిందే.నేరుగా పాఠశాల లోకి ప్రవేశించి.
అక్కడ అ పని చేస్తున్న ఉపాధ్యాయులు రెండు వర్గాలుగా చీల్చి… ఇద్దరిని దారుణంగా కాల్చి చంపారు.ఈ ఘటన జరిగి వారం కాకముందే మరోసారి ఉగ్రవాదులు జమ్మూకాశ్మీర్లో రెచ్చిపోయారు.
ఏకంగా ఐదుగురు భారత జవాన్లను కాల్చి చంపారు.పూర్తి వివరాల్లోకి వెళితే రజౌరి సెక్టార్ లో… జరిగిన కాల్పులలో.
ఐదుగురు జవాన్లు మృతి చెందగా మరికొంత మంది జవాన్లు గాయాలపాలయ్యారు.
మరణించిన వారిలో జూనియర్ అధికారి ఒకరు.ఆర్మీకి టెర్రరిస్టులకు జరిగిన ఈ కాల్పులలో.జూనియర్ అధికారితో పాటు నలుగురు జవాన్లు మృతి చెందారు.
స్థానికంగా ఉన్న ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి స్థానిక పోలీసులతో కలిసి జవాన్లు నిర్వహిస్తున్న ఈ ఆపరేషన్ లో… ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది.దీంతో టెర్రరిస్టులను పట్టుకోడానికి మరింత గాలింపు చర్యలు చేపట్టారు.
దీనికనుగుణంగా మరిన్ని ఆర్మీ బలగాలు రంగంలోకి దిగాయి.