గత కొన్ని రోజులుగా సరిహద్దులో ఉగ్రదాడులు ఎక్కువగా జరుగుతున్నాయి.టెర్రరిస్ట్ లని దేశంలోకి రాకుండా భద్రతా దళాలు తిప్పి కొడుతూ వుండటంతో, టెర్రరిస్ట్ లు భారత్ పై ప్రతీకార చర్యలకి పాల్పడుతున్నారు.
టెర్రరిస్ట్ సానుబూతి పరులతో దేశ సరిహద్దు వద్ద విద్వంసం సృష్టించడం తో శాతి భద్రతలకి విఘాతం కలిగిస్తున్నారు.తాజాగా ఈ రోజు మళ్ళీ జమ్మూ కాశ్మీర్ లో అవంతీ పురా సమీపంలో సైనికులని టార్గెట్ చేసుకొని ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.
జవాన్లు వెళ్తున్న వాహనాలపై ఉగ్రవాదులు బాబు దాడికి పాల్పడ్డారు.ఈ ఘటనలో 18 సిఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు.13 మంది జవాన్లకి గాయాలయ్యాయి.ఇదిలా వుంటే ఈ దాడి చేసింది తామే అని జైషె మహ్మద్ అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.
ఇదిలా వుంటే ఓ వైపు ఎన్నికలు సమీపిస్తున్న వుండటంతో, సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసి దేశంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగించడం ద్వారా ఎన్నికలని దెబ్బ తీసే కుట్రలో భాగంగానే ఇలాంటి దాడులు ఈ మధ్య కాలంలో సరిహద్దులో టెర్రరిస్ట్ లు తీవ్రతరం చేసినట్లు తెలుస్తుంది.ఇప్పటికే ఈ దాడికి పాల్పడింది తామే అని జైషె మహ్మద్ టెర్రరిస్ట్ సంస్థ ప్రకటించడంతో ఇప్పుడు సైనికులు ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకుంటారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.