నవీ ముంబాయి లో ఉగ్రవాద సంస్థ ఐసిస్ విధ్వంశాలు సృష్టించేందుకు సిద్దమౌతుందా అని అడిగితె అది నిజమే అని అనిపిస్తుంది.దీనికి కారణం ముంబాయి లో కెప్టే బ్రిడ్జ్ కు సపోర్ట్ గా ఉన్న ఓ పిల్లర్ పై ఐసిస్ ను పొగుడుతూ కొన్ని వ్యాఖ్యలు కనిపించాయి.
అంతేకాకుండా ఐసిస్ కు చెందిన కొందరు టెర్రరిస్ట్ ల పేర్లు కూడా ఉన్నాయి.అయితే వారితో పాటు మధ్య లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీ వాల్,అలానే మాజీ టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పేర్లు కూడా ఉండడం విశేషం.
దీనితో ఆ వ్యాఖ్యలను గమనించిన అధికారులు వెంటనే అప్రమత్తమై ముంబాయి లో హైఅలర్ట్ ప్రకటించారు.అయితే అధికారులు మాత్రం దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
సాధారణంగా రోజూ మద్యం సేవించి కొందరు యువకులు తరచూ అక్కడకి వస్తూ ఉంటారని స్థానికులు చెప్పడం తో ఆ కోణంలో కూడా వారు దర్యాప్తు చేపట్టారు.
ఒకవేళ తాగిన మైకంలో అలా పేర్లు రాశారా లేదా మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.ఇక ఈ హెచ్చరికలపై ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ.‘‘ఈ మెసేజ్లలో ఎప్పుడు, ఎక్కడ విధ్వంసం సృష్టిస్తారో ఉగ్రవాదులు స్పష్టంగా తెలిపారు.
ఇందులో ప్రముఖులు, రాజకీయ నాయకుల పేర్లను కోడ్ భాషలో రాశారు.దీన్నిమేము అసలు ఉపేక్షించం.
దీనిపై దర్యాప్తు వేగంగా జరుగుతుంది అని తెలిపారు.దీనికి సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.