ఉయ్యాల అంటే ఎవ్వరికి మాత్రం ఇష్టం ఉండదు.పసి పిల్లల దగ్గర నుండి పెద్ద వారి వరకు ఉయ్యాల ఇష్టంగా ఊగే వారు చాలా మందే ఉంటారు.
చిన్న పిల్లలు సరదాగా వేసవి సెలవల్లో అందరూ కలిసినప్పుడు ఊగితే సరదాగా ఉంటుంది.మన చిన్న తనంలో కూడా అందరం కలిసి ఉయ్యాల ఊగే ఉంటాం.
అయితే అదే సరదా ఇప్పుడు ఇద్దరు యువతుల ప్రాణాలు మీదకు తీసుకు వచ్చింది.
సరదాగా గడుపుదామని వచ్చిన ఇద్దరు యువతులు మృత్యువు దాకా వెళ్లి రావడంతో ఇక జీవితంలో ఉయ్యాల ఎక్కేందుకు వాళ్ళు సాహసించరు.
ఉయ్యాల మీద నుండి పడితే మహా అంటే దెబ్బలు తగులుతాయి కానీ ఇలా ప్రాణాపాయం ఎందుకు అవుతుందా.అని అనుకుంటున్నారా.అవునండి ఇది నిజం.ఆ యువతులు ఉయ్యాల ఊగడం వల్లనే మృత్యువు దాకా వెళ్లి ఇంకా ఆయుష్షు ఉండడం వల్ల తృటిలో తప్పించుకున్నారు.
ఈ ఘటన రష్యాలో చోటు చేసుకుంది.అక్కడ పర్యాటకుల కోసం కొండ చివర ఒక ఉయ్యాలను అధికారులు ఏర్పాటు చేసారు.అది డెంజర్ అని భద్రత సరిగ్గా లేదని అక్కడి ప్రభుత్వం హెచ్చరించిన అధికారులు పట్టించుకోలేదు.ఆ ఉయ్యాల కొండ చివర ఉండడం వల్ల అక్కడ నుండి స్లిప్ అయితే వెళ్లి అక్కడ లోయలో పడి పోతారు.
ఆ లోయ 6300 లోతు ఉంది.
అక్కడ నుండి పడి పోతే ప్రాణాలతో బయట పడడం కష్టం.ఆ ఇద్దరు యువతులు ఆ ఉయ్యాల ఎక్కి చక్కగా ఊగుతున్న సమయంలో ఒక్కసారిగా లోయలోకి చూడడంతో వాళ్లకు భయం వేసింది.దాంతో ఊగేటప్పుడే హడావుడిగా ఉయ్యాల నుండి దిగుదామని చూసారు.
అప్పుడు ఆ ఉయ్యాల తగిలి ఆ ఇద్దరు యువతులు లోయలోకి పడిపోయారు.సరిగ్గా వాళ్ళు పడిపోయే సమయంలో అక్కడ ఉన్న ప్లాట్ఫామ్ డెక్కింగ్ మీద పడి ప్రాణాలతో బయట పడ్డారు.
ఈ ఘటనలో ఇద్దరికీ గాయాలయ్యాయి.ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు.