మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.అరటి లోడుతో వెళ్తున్న ట్రాక్ అదుపుతప్పి పడిపోవటంతో 16 మంది దుర్మరణం చెందారు.
ఈ ఘటన జల్గావ్ జిల్లాలో కింగ్వాన్ వద్ద జరిగింది.మొత్తం 21 మంది ఇది ఇలా ఉండగా 16 మంది మరణించడంతో ఐదుగురికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.
అందుతున్న సమాచారం ప్రకారం వారి పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.బాధితులంతా రేవర్ తెహ్సిల్ జిల్లా అభోడా, కెహాలా గ్రామాలకు చెందిన వారిగా సమాచారం.
ఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకోవడంతో తీవ్రగాయాల పాలైన ఐదుగురిని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది.ఇదిలా ఉంటే సంఘటన జరిగిన స్థలం వద్ద శవాల కుప్పలు తెప్పలుగా పడి ఉండటంతో మిగతా వాహనదారులు చూడటానికి భయభ్రాంతులకు గురవుతున్నారు.
.