మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ?

గత సంవత్సరం కరోనా మనుషుల ప్రాణాలు తీస్తే, ఈ సంవత్సరం రోడ్దు ప్రమాదాల రూపంలో ఎందరో విగత జీవులుగా మారుతున్నారు.దేశంలో ప్రతి రోజు ఈ రోడ్దు ప్రమాదల వల్ల మరణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది.

 Terrible Road Accident In Madhya Pradesh, Terrible, Road Accident, Madhya Prades-TeluguStop.com

ఇకపోతే తాజాగా మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఆ వివరాలు చూస్తే.

మధ్యప్రదేశ్, సిధి జిల్లాలోని పట్నా వద్ద, 60 మంది ప్రయాణికులతో ప్రయాణం చేస్తున్న బస్సు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది.కాగా ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 28 మంది చనిపోయినట్టు అధికారులు గుర్తించారు.

అయితే ఏడుగురిని మాత్రం అధికారులు రక్షించినట్లు వెల్లడించారు.

ఇక కాలువలో నీటి ఉధృతి ఎక్కువగా ఉండటం వల్ల మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు.

కాగా నీటిలో గల్లంతైన వారికోసం రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందిని, ఎంత మంది ఇంకా బ్రతికి ఉన్నారో అనే సమాచారం తెలియదని, పూర్తి వివరాలు తెలియాలంటే ఇంకా సమయం పడుతుందని పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube