ఏపీలో ఘోర రోడ్దు ప్ర‌మాదం.. స్పాట్‌లోనే ముగ్గురి మరణం.. !

ప్రజలను విధి ఎన్ని రకాలుగా వేధించాలో అన్ని దారుల్లో వేదిస్తుంది.గత సంవత్సరం అంతా కరోనా మారణహోమాన్ని సృష్టించింది.

ఇక ఈ సంవత్సరం కరోనాకు తోడుగా ప్రకృతి వైపరిత్యాలు, ప్రమాదాలు జత కట్టాయి.ముఖ్యంగా రోడ్దు ప్రమాదాలు ఊహించని స్దాయిలో చోటు చేసుకుంటున్నాయి.

Terrible Road Accident In Ap Three Died In Spot , Andhrapradesh, Road Accident,

ఇకపోతే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లోని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ఆదివారం ఉద‌యం ఘోర రోడ్డుప్ర‌మాదం చోటు చేసుకుంది.వేగంగా వ‌చ్చిన ట్ర‌క్కు బుట్టాయి గూడెం వ‌ద్ద నిలిపి ఉంచిన ట్రాక్ట‌ర్ ట్రాలీని ఢీకొట్టగా, ఈ ప్ర‌మాదంలో అక్క‌డిక‌క్క‌డే ముగ్గురు ప్రాణాలు వదిలారు.

మ‌రో 17 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.కాగా ప్రమాదం గురించిన సమాచారాన్ని అందుకున్న పోలీసులు వెంటనే ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు.

Advertisement

ఈ క్రమంలో ప్రమాదంలో గాయపడ్డ క్ష‌త‌గాత్రుల‌ను ఏలూరు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించిన పోలీసులు, మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకుని మార్చూరికి తరలించి, కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.ఇక తప్పు ఎవరిదైనా పోయిన ప్రాణాలు మాత్రం తిరిగి రావు అన్నది సత్యం.

మజాకా వల్ల సందీప్ కిషన్ కెరియర్ సెట్ అవుతుందా..?
Advertisement

తాజా వార్తలు