ఏపీలో ఘోర రోడ్దు ప్ర‌మాదం.. స్పాట్‌లోనే ముగ్గురి మరణం.. !

ప్రజలను విధి ఎన్ని రకాలుగా వేధించాలో అన్ని దారుల్లో వేదిస్తుంది.గత సంవత్సరం అంతా కరోనా మారణహోమాన్ని సృష్టించింది.

 Terrible Road Accident In Ap Three Died In Spot , Andhrapradesh, Road Accident,-TeluguStop.com

ఇక ఈ సంవత్సరం కరోనాకు తోడుగా ప్రకృతి వైపరిత్యాలు, ప్రమాదాలు జత కట్టాయి.

ముఖ్యంగా రోడ్దు ప్రమాదాలు ఊహించని స్దాయిలో చోటు చేసుకుంటున్నాయి.

ఇకపోతే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లోని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ఆదివారం ఉద‌యం ఘోర రోడ్డుప్ర‌మాదం చోటు చేసుకుంది.వేగంగా వ‌చ్చిన ట్ర‌క్కు బుట్టాయి గూడెం వ‌ద్ద నిలిపి ఉంచిన ట్రాక్ట‌ర్ ట్రాలీని ఢీకొట్టగా, ఈ ప్ర‌మాదంలో అక్క‌డిక‌క్క‌డే ముగ్గురు ప్రాణాలు వదిలారు.

మ‌రో 17 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

కాగా ప్రమాదం గురించిన సమాచారాన్ని అందుకున్న పోలీసులు వెంటనే ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు.

ఈ క్రమంలో ప్రమాదంలో గాయపడ్డ క్ష‌త‌గాత్రుల‌ను ఏలూరు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించిన పోలీసులు, మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకుని మార్చూరికి తరలించి, కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.ఇక తప్పు ఎవరిదైనా పోయిన ప్రాణాలు మాత్రం తిరిగి రావు అన్నది సత్యం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube