లోకంలో రోజు రోజుకు పెరిగిపోతున్న పాపాల వల్ల పుడమి కూడా కన్నీరు పెడుతుందేమో.ఇప్పటికే మనుషులుగా పుట్టిన వారు చేయని పాపాలంటు లేవు.
ముఖ్యంగా హిందు ఆలయాల పై ఈ మధ్య కాలంలో చాలా దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే.ఇది చాలదన్నట్లుగా తాజాగా ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలంలో ఘోర అపచారం చోటు చేసుకుంది.
ఆ వివరాలు చూస్తే.
కొందరు వ్యక్తులు సున్నిపెంట నుంచి శ్రీశైలంకు చికెన్, మటన్ తీసుకెళ్లుతుండగా శ్రీశైలం టోల్ గేట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు పట్టుబడ్డారట.
వీరి వద్ద నుండి దాదాపు 20 కేజీల మటన్ స్వాధీనం చేసుకున్నట్లు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నరసింహారెడ్డి పేర్కొన్నారు.కాగా వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీశైలం పోలీస్ స్టేషన్ కు తరలించారట.
ఇక పవిత్ర పుణ్యక్షేత్రం అయినా శ్రీశైలంలో మాంసం, మద్యం నిషేధం.చట్టప్రకారం నేరం కూడా, అయినా గానీ భయం భక్తి లేని కొందరు ఈ నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఈ విషయంలో హద్దులు మీరి ప్రవర్తించడం తో భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుని మరోసారి ఈ ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.