హైదరాబాద్ వనస్థలిపురంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.ఈ ఘటనలో మహిళ సజీవ దహనమైంది.
వనస్థలిపురం ఎఫ్సిఐ కాలనీ లో ఓ ఇంటిలో జరిగిన ఈ ప్రమాదంలో.భార్య చనిపోగా భర్త బాలకృష్ణ మరియు ఇద్దరు పిల్లలు … ప్రమాదం నుండి బయటపడ్డారు.
కాగా బాలకృష్ణ కు తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు వెంటనే ఆయన్ని ఆసుపత్రిలో జాయిన్ చేశారు.ఇదే క్రమంలో చెలరేగిన మంటలను అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది రావడం జరిగింది.
తక్కువ టైం లోనే చాలావరకు మంటలను అదుపులోకి తీసుకు రావడం జరిగింది.
పరిస్థితి ఇలా ఉండగా మొదటి అంతస్తులో ఈ ఘటన జరగటంతో చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు కూడా… భయాందోళనలతో పరుగులు తీశారు.
ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బాలకృష్ణ తన ఇద్దరు పిల్లలను బయటకు తీసుకు వచ్చిన క్రమంలో తన భార్య సరస్వతి మంటల్లో చిక్కుకుపోవడంతో… ఆమె అక్కడికక్కడే మరణించినట్లు స్థానికులు చెబుతున్నారు.అయితే భర్త బాలకృష్ణ కి గాయాలు కావడంతో పోలీసులు ఆయనను ఆసుపత్రిలో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నారు.
ఇదే క్రమంలో అసలు ప్రమాదం ఏ విధంగా.ఎందుకు జరిగింది అన్న దాని కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.