ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వార్తలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో మరోపక్క రోడ్డు ప్రమాదాలు జరగటం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.
విషయంలోకి వెళితే సూర్యాపేట జిల్లా కోదాడ మేళ్లచెరువు దగ్గర ప్రైవేట్ బస్సు బోల్తా పడింది.పది మందికి గాయాలు కావడంతో.
వెంటనే బాధితులను మిగతా పాసింజర్లు ఆంబులెన్స్ కి ఫోన్ చేసి ఆసుపత్రిలో జాయిన్ చేశారు.ప్రమాదం జరిగే సమయంలో బస్సులో 39 మంది పాసింజర్లు ఉన్నారు.
బస్సు హైదరాబాద్ నుండి చెరుకుపల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది.జరిగిన ఘటన తెలుసుకున్న వెంటనే పోలీసులు రావడం జరిగింది.చాలా వరకు బస్సు అతి వేగంగా పోవటం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు.అక్కడ ఉన్న స్థానికులు తెలియజేస్తూ ఉన్నారు.
భయంకరంగా రోడ్డు మీద నుండి పక్కకు బోల్తా పడటంతో .బస్సులో ఉన్న ప్రయాణికులు ప్రమాదం జరిగిన సమయంలో తీవ్ర భయాందోళనకు గురయ్యారు.ఈ ప్రమాదంలో గాయపడిన 10 మంది పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు సమాచారం.
.