ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జూవారి సిమెంట్స్, అమర్ రాజా బ్యాటరీ సంస్థలను మూసివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ హైకోర్టు. తాజాగా తీర్పు ఇవ్వడం జరిగింది.
ఈ నేపథ్యంలో ఆ రెండు సంస్థలకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టేసింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు.
ఇచ్చిన ఆదేశాల మేరకు సదరు సంస్థలను మూసి వేసినట్లు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ…అమరరాజా సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా నేడు విచారణ జరిగింది.
ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది.
అంతేకాకుండా జూన్ 17 నాటికి సంస్థలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని ప్రభుత్వానికి కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. ఇదే టైములో కాలుష్య నియంత్రణ మండలి.
తీసుకున్న నిర్ణయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని తెలిపింది.అమర రాజా సంస్థ అధినేత తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్.
గతంలో.అంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఈ సంస్థకు ఇచ్చిన చిత్తూరు జిల్లాలో భూములను .జగన్ సర్కార్. భూములను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఆ సమయంలో కూడా హైకోర్టు జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను కొట్టేసింది. తాజాగా మరోసారి అమర రాజా సంస్థ విషయంలో జగన్ ప్రభుత్వానికి ప్రస్థానం మొట్టికాయలు వేయడంతో టిడిపి నేతలు సంచలన కామెంట్స్ చేస్తున్నారు.
కావాలని దురుద్దేశంతో ప్రభుత్వం టిడిపి నాయకులను టార్గెట్ చేస్తూ ఆర్థికంగా దెబ్బకొట్టాలని చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు చేస్తున్నారు.జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని అంటున్నారు.
.