మనుషులకు ఉన్న నిర్లక్ష్యమో, లేక అత్యాశనో తెలియదు గానీ ఒక్కోసారి జరిగే ఘోర ప్రమాదాల వల్ల జరిగే నష్టం ఎన్నో కుటుంబాలను రోడ్డున పడవేస్తుంది.ఇక రోడ్డుపైనే నిర్లక్ష్యంగా వ్యవహరించే మనుషులు కనీసం నీటి పై ప్రయాణించేటప్పుడైనా ఆ నిర్లక్ష్యపు చాయలు వదిలితే బాగుండు.
కానీ అలా జరగలేదు.దీని ఫలితంగా అధిక మొత్తంలో ప్రయాణికులు మరణించిన ఘటన బంగ్లాదేశ్లో చోటుచేసుకుంది.
ఈ ఘోర ప్రమాద ఘటన తాలూకు వివరాలు చూస్తే.ఈ రోజు ఉదయం పద్మ నదిలో బంగ్లా బజార్ లోని ఫెర్రీ ఘాట్ నుంచి ప్రయాణీకులతో బయలు దేరిన పడవలో అనుభవం లేని వ్యక్తి పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కించుకుని వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఇసుక రవాణా చేస్తున్న మరో ఓడను ఢీ కొట్టింది.
కాగా ఈ ప్రమాదంలో 26 మంది ప్రయాణికులు మృతి చెందగా, చాలా మంది ప్రయాణీకులు గల్లంతు అయినట్టు సమాచారం.ఇంకా ఈ మృతుల సంఖ్య పెరిగి అవకాశం ఉందని ఇక్కడి అధికారులు తెలుపుతున్నారట.
నదిలో నిర్లక్ష్యంగా, వేగంగా పడవను నడి ప్రమాదానికి గురి చేసినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.