దేశాన్ని కరోనా భయపెడుతుంటే మరోవైపు అగ్ని ప్రమాదాలు కూడా అదేస్దాయిలో ప్రాణాలను హరించి వేస్తున్నాయి.ఇక గత కొద్ది రోజుల నుండి కోవిడ్ హస్పటల్లో అగ్ని ప్రమాదాల సంఖ్య పెరుగుతూ వస్తుంది.
ఈ క్రమంలో కరోనాతో పోరాడుతున్న రోగులు అగ్నికి ఆహూతి అవుతున్నారు.
ఈ వైరస్ బారిన పడిన వారు బ్రతికి బట్టకట్టాలని తాపత్రయం పడుతున్న మృత్యువు అగ్ని రూపంలో వారి ఆయువును హరించడం బాధాకరం.
ఇకపోతే తాజాగా ఇరాక్ రాజధాని బాగ్దాద్ లోని ఇబ్న్ అల్ ఖతీబ్ కరోనా ఆసుపత్రిలోని ఐసీయూ యూనిట్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
ఆదివారం తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాదంలో 23 మంది కరోనా రోగులు అగ్నికి ఆహుతి కాగా, 50 మందికి పైగా పేషెంట్లకు గాయాలయ్యాయని సమాచారం.
ఇకపోతే ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి భీభత్సంగా కొనసాగుతుండగా, మరో వైపు ఆక్సిజన్ కొరత కారణంగా రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇలా ఒకవైపు కరోనా మరోవైపు కరోనా ఆసుపత్రుల్లో అగ్నిప్రమాదాలు ప్రజలను ఊపిరి సలపకుండా చేస్తున్నాయి.