ఈ రోజు మంత్రి పరిటాల సునీత కు అవమానం జరిగింది.సునీత కాన్వాయ్ ను అడ్డుకునేందుకు డ్వాక్రా మహిళలు యత్నించారు.
కాన్వాయ్ ను మహిళలు అడ్డుకునేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.ఈ క్రమంలో మహిళలను పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ జరిగింది.
దీంతో అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం తోపుదుర్తిలో ఉద్రిక్తత నెలకొంది.
ఈ క్రమలో మంత్రి కాన్వాయ్ పై చెప్పులు విసిరారు.డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానన్న హామీని ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపిస్తూ మహిళలు నిరసన వ్యక్తం చేశారు.నల్ల జెండాలు ధరించి ఆందోళనకు దిగారు.
కాగా, డ్వాక్రా మహిళల ఆందోళన కారణంగా యాలేరు గ్రామ శివారులో పరిటాల సునీత గంటకు పైగా వేచి ఉన్నారు.తోపుదుర్తికి సునీత కాన్వాయ్ నాలుగు గంటలు ఆలస్యంగా చేరుకుంది.
తాజా వార్తలు