హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటెల పాదయాత్ర అనేది నేటి నుండి మొదలైన విషయం తెలిసిందే.అయితే ఇప్పటివరకు ప్రచారాన్ని ప్రారంభించినా పాదయాత్ర మాత్రం చేపట్టలేదు.
అయితే టీఆర్ఎస్ ఇంకా ప్రచారాన్ని మొదలు పెట్టలేదు.ఇప్పటికే బీజేపీ ప్రచారంలో దూసుక పోతుండడంతో టీఆర్ఎస్ కు గుండెల్లో గుబులు మొదలైందని చెప్పవచ్చు.
ఎందుకంటే హుజూరాబాద్ లో పాదయాత్రను మొదలు పెట్టడంతో ప్రజల చూపు ఒక్కసారిగా బీజేపీ మరియు ఈటెల రాజేందర్ పై పడడంతో టీఆర్ఎస్ నాయకులకు అక్కడ ప్రజల నుండి సరైన మద్దతు దొరకదనే ఆలోచనలో ఉన్నారు.
అయితే బీజేపీ ఓటర్లను ప్రభావితం చేసే పనిలో నిమగ్నం కావడంతో ప్రజల నుండి ఈటెల రాజేందర్ ఈటెల సతీమణికి కొంత ఎదురుదెబ్బలు తగులుతున్నాయనే చెప్పవచ్చు.అయితే టీఆర్ఎస్ పార్టీ అధికారికంగా హుజూరాబాద్ అభ్యర్థిపై అధికారిక ప్రకటన రాకున్నా అంతర్గతంగా టీఆర్ఎస్ లో జోరుగా చర్చ సాగుతోంది.అయితే పాడి కౌశిక్ రెడ్డి అభ్యర్థిగా ఖరారవుతారని భావించినా ఇక కౌశిక్ రెడ్డిపై టీఆర్ఎస్ అంతగా భరోసా లేకపోవడంతో కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపాలని భావిస్తోంది.
అయితే దళిత బంధు పథకంతో హుజూరాబాద్ లో ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారం చేసి బీజేపీకి ఎఫెక్ట్ ఇవ్వాలని భావిస్తునట్టు సమాచారం.కెసీఆర్ దళిత బంధు వ్యూహం ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాల్సి ఉంది.