వికారాబాద్ జిల్లా దుద్యాల గ్రామంలో వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర కొనసాగుతుంది.ఈ క్రమంలో షర్మిలను టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు.
కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.అనంతరం ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు.
దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.