రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్లో ఉద్రిక్తత నెలకొంది.రోడ్డు వెడల్పు కోసం మున్సిపల్ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.
ఈ క్రమంలో అడ్డుగా ఉన్న ఇళ్లు, మెట్లను అధికారులు తొలగించారు.ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తొలగిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అనంతరం స్థానికులు, మున్సిపల్ అధికారులతో వాగ్వివాదానికి దిగారు.దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
కాగా భారీ బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలు కొనసాగిస్తున్నారు.