నగర పంచాయతీ కమీషనర్, సిబ్బందిని అడ్డుకున్న టిడి పారాపురం గ్రామస్థులు.నగర పంచాయతీకి సంబంధించిన చెత్తను టిడి పారాపురం గ్రామ శివారులో డంప్ చేసేందుకు వెళ్లిన సిబ్బంది.
తమ గ్రామ సమీపంలో చెత్తను డంప్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన గ్రామస్థులు.తాము టిడిపికి చెందిన వారనే అధికారులు కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్న గ్రామస్థులు.
చెత్త తరలించే వాహనాలకు అడ్డంగా బైఠాయించి నిరసన తెలుపుతున్నా గ్రామస్థులు.చెత్తను తమ గ్రామంలో డంప్ చేసే ఆలోచన విరమించుకోవాలని డిమాండ్.లేనిపక్షంలో ఆత్మహత్యలకు పాల్పడతామని హెచ్చరిక.భారీగా మోహరించిన పోలీసులు.
గ్రామస్థులకు ,పోలీసులకు మధ్య వాగ్వాదం.ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ నిరసన తెలుపుతున్న గ్రామస్థులను అరెస్ట్ చేసిన పోలీసులు
.