చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం సంసిరెడ్డిపల్లెలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.టీడీపీ నేత నారా లోకేశ్ చేస్తున్న ‘యువగళం’ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు.
లోకేశ్ మాట్లాడకుండా పోలీసులు మైకును లాక్కున్నారు.అదే క్రమంలో లోకేశ్ నిలబడ్డ స్టూల్ ను సైతం లాక్కునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వివాదం చెలరేగి తోపులాటకు దారి తీసింది.దీంతో సంసిరెడ్డిపల్లెలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
మరోవైపు పోలీసుల తీరుపై నారా లోకేశ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలో స్టూల్ పై నిలబడి నిరసన తెలుపుతున్నారు.