అనంతపురం జిల్లా పెద్దపప్పూరులో ఉద్రిక్తత

అనంతపురం జిల్లా పెద్దపప్పూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.పెన్నా నదిలో ఇసుక రీచ్ వద్ద తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

 Tension In Peddpapur Of Anantapur District-TeluguStop.com

రీచ్ నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారంటూ జేసీ రోడ్డుపై బైఠాయించారు.మైనింగ్ నిబంధనలకు వ్యతిరేకంగా వేల టిప్పర్ల ఇసుక తరలిస్తున్నారని ఆరోపించారు.

యదేచ్చగా రాత్రి పగలు తేడా లేకుండా ఇసుకను తరలిస్తున్న జిల్లా కలెక్టర్ కానీ, అధికారులు కానీ పట్టించుకోవడం లేదని ఆగ్రహాం వ్యక్తం చేశారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఇసుక అక్రమ రవాణాపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పినట్లు తెలుస్తోంది.అయినా ఆందోళన విరమించకపోవడంతో జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube