అనంతపురం జిల్లా పెద్దపప్పూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.పెన్నా నదిలో ఇసుక రీచ్ వద్ద తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
రీచ్ నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారంటూ జేసీ రోడ్డుపై బైఠాయించారు.మైనింగ్ నిబంధనలకు వ్యతిరేకంగా వేల టిప్పర్ల ఇసుక తరలిస్తున్నారని ఆరోపించారు.
యదేచ్చగా రాత్రి పగలు తేడా లేకుండా ఇసుకను తరలిస్తున్న జిల్లా కలెక్టర్ కానీ, అధికారులు కానీ పట్టించుకోవడం లేదని ఆగ్రహాం వ్యక్తం చేశారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఇసుక అక్రమ రవాణాపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పినట్లు తెలుస్తోంది.అయినా ఆందోళన విరమించకపోవడంతో జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.