మెట్పల్లి ఎంఎల్ఏ విద్యాసాగర్ రావు శ్రీ రాముడి ఆలయ నిర్మాణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.ఈ విషయంపై రాష్ట్ర బిజేపి నేతలు, కార్యకర్తలు ఆయన పై మండి పడుతున్నారు.
ఈ సందర్భంగా మెట్ పల్లి లోని ఆయన నివాసం ను ముట్టడించాలని బిజేపి నేతలు పిలుపు నిచ్చారు.ఈ సందర్భంగా హైదరాబాద్ లో భారీ పోలీసు బందోబస్తు ను ఏర్పాటు చేశారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా ఉమ్మడి కరీంనగర్ జిల్లానుండి పోలీసులను దింపింది.అలాగే సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి నుండి పెద్ద ఎత్తున పోలీసు బ్యాటాలియన్ రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దింపింది.
ఈ నేపథ్యలోనే టిఆర్ఎస్ మంత్రులు నిరంజన్ రెడ్డి.కొప్పుల ఈశ్వర్ రెడ్డి లు మెట్ పల్లి నియోజక వర్గంలోని మల్లాపూర్, ఇబ్రహీంపట్టణం లోని పలు మండలాల్లో వాళ్ళు పర్యటించనున్నారు.ఈ సందర్భంగా అక్కడ గొడవలు కూడా జరిగాయి.ఎంఎల్ఏ విద్యా సాగర్ రావు మాట్లాడుతూ నేను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారు అని తెలిపాడు.ఎవరి మనసు అయిన నొచ్చుకొను ఉంటే క్షమించండి అన్నాడు.విద్యా సాగర్ రావు గారు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఏమిటి అంటే రాముడి ఆలయ నిర్మాణం పేరుతో బిచ్చం ఎత్తుకుంటున్నారు.
ఉత్తర్ ప్రదేశ్ రాముడు మనకు అవసరమా అని అన్నాడు.ఈ వ్యాఖ్యలు బిజేపి నేతలకు కోపం తెప్పించడం జరిగింది.