ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది.
అమలాపురం మండలం సాకూరు గున్నేపల్లి పోలింగ్ బూత్ లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.బ్యాలెట్ పత్రాల పై జనసేన పార్టీకి సంబంధించి గుర్తు లేకుండా వేరే పార్టీకి సంబంధించిన గుర్తులు ఉండటంతో… అధికారులతో జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు.
ఈక్రమంలో అధికారులతో మాట మాట పెరగటంతో పోలింగ్ బూతులో సామాగ్రిని ధ్వంసం చేశారు.దీంతో పోలింగ్ ప్రక్రియను నిలిపి వేశారు అధికారులు.జనసేన పార్టీకి సంబంధించిన పూర్తి లేకపోవడంతో ఏజెంట్లు, నాయకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.దీంతో అధికారులను నిలదీసే క్రమంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో.
పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకు వస్తున్నారు. ఇదిలా ఉంటే పంచాయతీ ఎన్నికల సమయంలో .ఇదే ప్రాంతంలో జనసేన పార్టీకి భారీ స్థాయిలో మద్దతు రావటంతో పరిషత్ ఎన్నికలలో .పార్టీని నిర్వీర్యం చేయడానికి ఈ విధమైన డ్రామాలు ఆడుతున్నారు అంటూ తాజాగా తన పై జనసేన పార్టీ కార్యకర్తలు నేతలు ఆరోపణలు చేస్తున్నారు.