ఎన్నో నెలల నుంచి వైసీపీని ఓ టెన్షన్ తీవ్రంగా వెంటాడుతోంది.ముఖ్యంగా మంత్రులను.
ఎందుకంటే జగన్ పాలన సగం మేర పూర్తయింది కాబట్టి.దీంతో మంత్రుల మార్పు ఎప్పుడు ఉంటుందో అని అంతా టెన్షన్ పడుతున్నారు.
అయితే చాలామంది మీద ఈ ఎఫెక్ట్ అనేది కచ్చితంగా కనిపిస్తుంది.ఇందులో కొందరి మీద ప్రత్యేకంగా జగన్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.
వారి పని తీరును బేరీజు వేసుకుని, సామాజిక వర్గం ఆధారంగా కొందరి మీద వేటు వేసేంఉదకు రెడీ అవుతున్నారంట.అందరూ ఊహించినట్టుగానే సగం మంది మీద అయినా ఎఫెక్ట్ పడే ఛాన్స్ కనిపిస్తోంది.
ఇంకో వైపు ఇప్పుడు పార్టీలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే.ఇప్పట్లో మార్పు వద్దనే సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి.రెండు పరిణామాల మధ్య జగన్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారని తెలుస్తోంది.ఇది వేటు పడుతుందనే మంత్రులకు కొంత ఊరటనిచ్చే అంశం.
ఇక సగం పాలన నుంచి ఇంకో నాలుగు నెలలు గడిస్తే జగన్ పాలన దాదాపు మూడేళ్లు కంప్లీట్ కాబోతోందతి.దాంతో మళ్లీ మంత్రుల మార్పు అనేది తెరమీదకు వచ్చే చాన్స్ ఉంటుంది.
ఎన్నికలకు ముదు కొత్త మంత్రుల ఉండాలనేది జగన్ ప్లాన్.కాబట్టి ఆ మేరకు ప్రతిపాదనలు కూడా ఇప్పటికే అందాయి.
కాగా ఇప్పుడు ఉన్న మంత్రుల్లో ఒక నలుగురిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉంచేందుకు వీల్లేదంట.ఈ మార్పు అనేది రెండు ప్రాంతాలకు సరిగ్గా ఉంటుందని తెలుస్తోంది.ముఖ్యంగా రాయల సీమ నుంచి ఇద్దరిని, కోస్తా నుంచి ఇద్దరిని తీసేస్తారని, ఆ ఇద్దరి ప్లేసుల్లో సామాజిక వర్గాల ఆధారంగా సమీకరణాలు చేసుకుని మరో నలుగురిని తీసుకుంటారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది.ఈ సమీకరణాలు మాత్రం జగన్ పని ఆధారంగా అయినా లేదంటే సామాజిక వర్గాల ఆధారంగా అయినా చేపడుతారని సమాచారం.
మరి ఆ వేటు ఎవరి మీద పడుతుందో చూడాలి.