వికారాబాద్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.రైతు సమస్యలపై వినతిపత్రం ఇచ్చేందుకు కలెక్టర్ కార్యాలయానికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లారు.
ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ శ్రేణులు కలెక్టరేట్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.లోపలికి వెళ్లేందుకు యత్నించిన పార్టీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.
ఈ క్రమంలో పార్టీ శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాట ఉద్రిక్తతకు దారితీసింది.దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పార్టీ శ్రేణులు భారీగా తరలిరావడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.