తెలంగాణ డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు డీజీపీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు.
ఎస్సై, కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ లో రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని బీజేవైఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఎస్సై, కానిస్టేబుల అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
దీంతో అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.దీంతో కార్యాలయం దగ్గర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.