చైనాలోని ఐఫోన్ ప్లాంట్ లో ఉద్రిక్తత నెలకొంది.వేలాది మంది కార్మికులు పరిశ్రమ వద్ద ధర్నాకు దిగారు.
తమను ఇళ్లకు పంపించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.కరోనా, లాక్ డౌన్ ప్రభావంతో పాత కార్మికులు విధుల్లోకి రాకపోవడంతో కొత్త కార్మికులను నియమించారు.
ఫ్యాక్టరీల్లో ఉత్పత్తిని కొనసాగించాలని నిర్ణయించిన ప్రభుత్వం… వీరికి ఫ్లాంట్ లలోనే కంపెనీలు క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.అయితే కొన్ని నెలలుగా క్వారంటైన్ కేంద్రాల్లో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది,.
ఈ నేపథ్యంలో తమను ఇళ్లకు పంపాలని కార్మికులు ఆందోళన చేపట్టారు.