తిరుపతి జిల్లా గూడూరు నారాయణ ఇంజినీరింగ్ కాలేజ్ వ్దద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.నిన్న నారాయణ కాలేజీ హాస్టల్ లో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.
విద్యార్థిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.ఈ క్రమంలోనే నారాయణ కాలేజ్ హాస్టల్ అద్దాలను బాధితులు ధ్వంసం చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు బాధితులను అడ్డుకున్నారు.దీంతో మృతుని బంధువులు పోలీసులకుపై తిరగబటంతో వాగ్వివాదం చెలరేగింది.
ఈ ఘర్షణలో ఎస్ఐకి గాయాలు అయినట్లు తెలుస్తోంది.