చాలామంది సినీ తారలను కొంతమంది అభిమానులు ఆరాధిస్తూ ఉంటారు.అయితే ఆరాధించడం అంటే అంతా ఇంతా కాదు.
తమ అభిమాన తారలకు ఏకంగా గుడి కట్టే అంత అభిమానించడం అన్నమాట. అయితే ఇలా అభిమానించడంలో తమిళ తంబీలు ఒక అడుగు ముందే ఉంటారు.
ఇంతకీ అసలు ఏ హీరోయిన్ కి గుడి కట్టారో తెలిస్తే షాక్ అవుతారు.సవ్యశాచి సినిమాతో తెలుగు వెండి తెరకు పరిచయం అయిన అందాల తార నిధి అగర్వాల్ గుర్తు ఉందా.? అలాగే ఇస్మార్ట్ శంకర్ లో రామ్ సరసన ఆడి పాడింది ఈ ముద్దుగుమ్మ.ఈ ఇస్మార్ట్ బ్యూటీ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే మంచి నటిగా గుర్తింపు పొందింది.
ప్రస్తుతం ఈ అమ్మడు కోలీవుడ్ లో బాగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నది.ప్రస్తుతం నిధి తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించనుంది.
పవన్ – క్రిష్ కాంబోలో రానున్న సినిమాలో నిధి హీరోయిన్గా చేసే లక్కీ చాన్స్ కొట్టేశారు.అయితే, ఇటీవల తమిళ తంబీలు నిధికీ ఒక అరుదైన బహుమానం అందించారు.
ఆమె అభిమానులు ఈమెకి విగ్రహం కట్టించి పాలాభిషేకాలు కూడా చేశారు.ఈ కార్యక్రమానికి చెందిన ఫోటోలు.
ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.అసలు ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్స్ దక్కని గౌరవం నిధికి దక్కడంతో అందరు ఆశ్చర్యంలో మునిగిపోయారు.కొందరు నెటిజన్లు అయితే అసలు నిధి ఏం చేసిందని గుడి కట్టారు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.కారణం లేకుండా గుడి ఎలా కట్టారు అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
ఇంకా చూడాలి ముందు ముందు ఎంతమంది హీరోయిన్స్ కి గుడి కడతారో ఈ తమిళ సినిమా అభిమానులు.