టాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచిన టెంపర్ సినిమా మొదట బాలీవుడ్ లో రీమేక్ అయిన సంగతి తెలిసిందే.అక్కడ కూడా సింబా పేరుతో సినిమా 200కోట్ల కలెక్షన్స్ సాధించి రణ్ వీర్ కి మార్కెట్ ని పెంచేసింది.
ఇక తమిళ్ లో కూడా విశాల్ అయోగ్యగా సినిమాను రీమేక్ చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు.
అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో కూడా రిలీజ్ చేసేందుకు విశాల్ సిద్దమవద్దం విడ్డురంగా ఉంది.ఈ నెల 12 అయోగ్య తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.సాధారణంగా విశాల్ ఏ సినిమా చేసిమా తెలుగులో డబ్ అవుతుంది.
కానీ టాలీవుడ్ లో దాదాపు అందరూ వీక్షించిన టెంపర్ కథను మళ్ళీ వదలడమంటే కాస్త రిస్క్ అనే చెప్పాలి.
పైగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలో విశాల్ కనిపిస్తే ఆడియెన్స్ ఎంతవరకు ఎప్పుకుంటారో చెప్పడం కష్టమే.
అయోగ్య కథలో పెద్దగా మార్పులు చేసింది లేదు.ఎన్టీఆర్ ను చూసిన ఫ్రెమ్ లో విశాల్ ని మళ్ళీ చూస్తే టాలీవుడ్ ఆడియెన్స్ పెదవి విరిచే అవకాశం ఉంది.
మరి ఈ డబ్బింగ్ సినిమాతో విశాల్ ఎంతవరకు పాజిటివ్ టాక్ ను అందుకుంటాడో చూడాలి.